MP Mallu Ravi: నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి కొల్లాపూర్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సభలో ప్రసంగాన్ని ఆపమని చీటీ రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇక్కడ చికెన్, చేపల ఫ్రై తినడానికి రాలేదు, అభివృద్ధి గురించే మాట్లాడుతున్నా' అని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు కడుతున్నామని, బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.