మెదక్ జిల్లాలో బంగారం అప్పుల వివాదం తీవ్రమైంది. ఇంటి నిర్మాణానికి ఐదుగురి వద్ద 9 తులాల బంగారం అప్పుగా తీసుకున్న దంపతులు, ధరలు పెరగడంతో రుణదాతల నుంచి అదనపు బంగారం డిమాండ్ను ఎదుర్కొన్నారు. నిరాకరించడంతో రవిని విద్యుత్ స్తంభానికి కట్టి కొట్టారు. పోలీసుల జోక్యం తర్వాత కూడా రుణదాతలు దాడి చేసి, ఇంటికి తాళం వేసి గెంటేశారు.