ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాలలో ఎండలు కాస్తుంటే.. మరికొన్ని జిల్లాలో వానలు కురుస్తున్నాయి. గురువారం రోజున కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే రాయలసీమ జిల్లాలలో ఎండలు ప్రభావం చూపించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.