ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విచిత్ర ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగింది. అది కూడా భూ వివాదానికి సంబంధించిన కేసులోనే ఈ విడ్డూరం చోటుచేసుకుంది. సాధారణంగానే.. ఓ కేసు నమోదు చేయాలంటేనే పోలీసులు అన్ని విచారణ చేస్తారు.. అలాంటిది భూవివాదం అంటే.. ఇరువైపులా దర్యాప్తు చేసిన తర్వాతే కేసు తీవ్రతను బట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంటారు. అలాంటిది.. ఇక్కడ మాత్రం పోలీసులు కాస్త అత్యుత్సాహమే ప్రదర్శించి.. దొరికిపోయారు.