ఏసీబీ అధికారుల తనిఖీల్లో గజ్వేల్ తహసీల్దార్ అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా రూ.40 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు దాడుల్లో గుర్తించారు. ఆస్తులు, డబ్బు, బంగారం, లగ్జరీ కార్లను పోగేసినట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో గజ్వేల్ తహసీల్దార్ ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.