ఏపీ రాజకీయాల్లో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల తాలూకు మంట చల్లారడం లేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. అయితే చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తాజాగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి దీనిపై స్పందించారు. గుంటూరులో జరిగిన ఘటన రాయలసీమలో జరిగి ఉంటే.. కారుతో సహా పాతేసేవాళ్లమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.