ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిజిల్లాలో వానలు పడుతుండగా.. మరికొన్ని చోట్ల సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. శనివారం కూడా పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మధ్యన నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో కొన్నిజిల్లాలలో తేలికపాటి వానలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.