మెదక్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భార్య రాజమణి మృతి చెందగా, భర్త నవీన్గౌడ్, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. గతంలో నవీన్ పై రమ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.