కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీనగర్లో కన్న తండ్రే.. తన ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల వయసు ఉన్న కవల పిల్లలను బావిలోకి తోసేసిన శ్రీశైలం అనే వ్యక్తి.. ఆ తర్వాత తానూ దూకాడు. అయితే ఈత రావటంతో ఈదుకుంటూ వచ్చేశాడు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా అనుమానిస్తున్నారు. స్థానికులు శ్రీశైలాన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.