రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇన్స్టాగ్రామ్ మాయలో పడి ఓ యువతి కన్నతల్లి బంగారానికే ఎసరు పెట్టింది. ఇన్స్టాలో పరిచయమైన ప్రియుడు ఖరీదైన బైక్ కావాలని అడగటంతో ఇంట్లో ఉన్న తల్లి బంగారాన్ని ఎవరికీ తెలియకుండా అమ్మేసి అతడికి కొత్త బైక్ కొనిచ్చింది. ఇంట్లో నగలు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో అసలు విషయం వెలుగుచూసింది.