హైదరాబాద్ కోకాపేట నియోపోలిస్ భూముల రెండో విడత ఈ-వేలంలో ఎకరానికి రూ. 151 కోట్ల 25 లక్షలు పలికి రికార్డు సృష్టించింది. కేవలం 9.06 ఎకరాల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,352 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ప్లాట్ 15ను లక్ష్మీనారాయణ కంపెనీ, ప్లాట్ 16ను గోద్రెజ్ ప్రాపర్టీస్ దక్కించుకున్నాయి. నియోపోలిస్లో ఆకాశమే హద్దుగా నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఉండటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. మిగతా ప్లాట్లకు డిసెంబర్ 3, 5 తేదీల్లో వేలం జరగనుంది.