ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులలో సంప్రదించేందుకు వీలుగా ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ప్రవాస తెలుగు ప్రజల కోసం ఫోన్ నంబర్, వాట్సాప్ నంబర్, ఈమెయిల్ ఐడీ అందుబాటులో ఉంచింది. తెలుగు ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.