తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దుబాయ్లో విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు. గత ఐదు రోజుల క్రితం వ్యక్తిగత పనుల నిమిత్తం మంత్రి కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లగా.. విమాన సర్వీసులు రద్దు కావటంతో అక్కడే చిక్కుకుపోయారు.