హైదరాబాద్ నగరంలోని కొన్ని చికెన్ సెంటర్లలో దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల బేగంపేటలోని బాలయ్య చికెన్ సెంటర్లో కుళ్లిన చికెన్ను అధికారులు సీజ్ చేయగా.. తాజాగా ఇసామియాబజార్, న్యూమోతీనగర్లోని ఏపీసీ చికెన్ మార్కెట్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి అపరిశుభ్ర వాతావారణాన్ని ప్రత్యక్షంగా చూసిన నగర మేయర్ విజయలక్ష్మి వెంటనే సీజ్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.