దక్షిణ భారతదేశంలోనే ద్రౌపదీ దేవి సమేత పాండరాజుల ఆలయానికి రథం ఉన్న ఏకైక ఆలయం పుత్తూరులోనే ఉండటం విశేషం. విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత ఔరంగజేబు సైన్యం దక్షిణ భారతదేశంలో దాడులు చేయడంతో తమిళనాడులోని చెంగల్పట్టు ప్రాంతం నుంచి అనేక మంది పుత్తూరుకు వలస వచ్చారు. ఆ సమయంలో ఏడుగురు అన్నదమ్ములు బావి తవ్వుతుండగా అమ్మవారి బొమ్మ దొరకడం.. ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించడం.. ఇప్పుడు అదే ఆలయానికి ప్రత్యేకత రావడంతో ఏటా శ్రావణ మాసంలో పూజలు నిర్వహిస్తున్నారు.