Sajjanar On Reels On Railway Track: సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చిలో కొందరు యువకులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా ఓ యువకుడు రైలు పట్టాల మధ్య పడుకుని ప్రమాదకర విన్యాసం చేస్తూ వీడియో తీశాడు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఇది పిచ్చికి పరాకాష్ట అని, ఇలాంటి మానసిక రోగులకు చికిత్స అవసరమని ఆయన అన్నారు. ఇలాంటి చర్యల వల్ల తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తారో ఆలోచించాలని హితవు పలికారు.