Chandrababu on AP Population at Muppalla NTR District: జనాభా పెరుగుదలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే.. 2035 నాటికి ఏపీలో జనాభా పెరగకపోతే ఊరిలో పిల్లలు ఉండరని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరగకపోతే 2035 నాటికి ఏపీలోని ఊర్లలో యువకులు తగ్గి, ముసలి వాళ్ళే ఉంటారన్నారు. ముసలి వాళ్లు కూడా చనిపోతే తర్వాత ఊర్లు కూడా ఉండవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.