AP Govt Poor People Houses Bills Payment: ఆంధ్రప్రదేశ్లో పేదల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్నూలు జిల్లాలో 52,076 ఇళ్ల నిర్మాణం జరుగుతుండగా, లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అర్హులకు సహాయం అందించేందుకు దరఖాస్తుల స్వీకరణ మళ్లీ ప్రారంభమైంది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన.