ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక శుభవార్త చెప్పారు. నెలలోపే పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తెనాలి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. రేషన్ కార్డులు మంజూరు చేయించారు, బియ్యం పంపిణీ చేశారు. కొల్లిపరలో ల్యాండ్ సర్వే సమస్యను పరిష్కరిస్తామని, డొంక రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.