మార్చి నెల ప్రారంభంలోనే నడినెత్తిన సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ సంస్థ హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే జూన్ నెలలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలుస్తోంది. మే నెలలో ఎల్నినో ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నట్లు ECMWF అంచనా వేసింది. ఆగస్ట్ నాటికి బలపడే అవకాశం ఉందని తెలిపింది.