ఈ ఏడాది ఎండలు దంచికొడతాయని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. తెలంగాణలో వడగాలుల ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లకపోవటం ఉత్తమమని అంటున్నారు.