Andhra Pradesh Govt Pura Mithra App: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురమిత్ర యాప్లో కీలక మార్పులు చేసింది. ఒకే ప్రాంతంలో ఒకే రకమైన సమస్యలు ఐదుకు మించి వస్తే, అవి కమిషనర్ల లాగిన్లో ఆరెంజ్ కలర్ హాట్స్పాట్లుగా కనిపిస్తాయి. ఈ సమస్యలకు కమిషనర్లు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, క్షేత్ర పర్యటనల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పుర యాప్లో సరికొత్త మార్పుల్ని తీసుకొచ్చింది.