Kadiyam Farmer Donated Rs 20 Lakhs: సర్ ఆర్థర్ కాటన్పై ఉన్న అభిమానంతో.. ఆయన జయంతి రోజున ఓ రైతు గొప్ప మనసు చాటుకున్నారు. తూర్పుగోదావ జిల్లా కడియం మండలం దుళ్లకు చెందిన కౌలు రైతు సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి) తన దగ్గర పనిచేసేవారికి సాయం చేశారు. కాటన్ జయంతి రోజున 10 కుటుంబాలకు రూ.20 లక్షలు విడుదల చేశారు. అంతేకాదు భాస్కరరెడ్డి తన ఇంటిముందు కాటన్ విగ్రహం ఏర్పాటు చేశారు.