టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. కరెంట్ బిల్లు పెండింగ్లో ఉందని ఫేక్ మెసేజ్లు పంపించి, లింక్ క్లిక్ చేయిస్తే ఖాతాలోని డబ్బును ఖాళీ చేస్తున్న మోసం తాజాగా వెలుగు చూసింది. కరెంట్ బిల్లు పెండింగ్ ఉందని.. సాయంత్రంలోగా బిల్లు చెల్లించకపోతే కరెంట్ కట్ అవుతుందని.. మెస్సేజ్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి వెంటనే బిల్లు చెల్లించాలంటూ మెస్సేజ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.