ఈ నెల 29న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన మూడోసారి ప్రధాని అయిన తర్వాత విశాఖకు మోదీ రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ప్రధాని వేల కోట్ల రూపాయల విలువైప ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతోపాటుగా ఏపీ విభజన చట్టంలోని కీలక హామీ రైల్వే జోన్కు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ఏయూలో జరిగే సభా వేదిక నుంచే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.