తమ పోరాట ఫలితంగానే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కేంద్రాల ఆలస్యం వల్ల రైతులు దళారులకు తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోయారని విమర్శించారు. కాళేశ్వరం జలాల వల్ల సిద్దిపేటలో యాసంగి సాగు 8 వేల నుండి 80 వేల ఎకరాలకు పెరిగిందని, రైతులు మొక్కజొన్న క్వింటాల్కు రూ. 2400 , సన్ఫ్లవర్ రూ. 7721 చొప్పున మద్దతు ధర పొందాలని సూచించారు.