తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల గణన హామీకి కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాము చేపట్టబోయే ఈ కార్యక్రమం తెలంగాణలో చరిత్ర సృష్టించబోతోందని జోష్యం చెప్పారు. ప్రభుత్వాన్ని తిట్టడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. తెలంగాణలో అసలు కేసీఆర్ జాడే లేదని అన్నారు.