తెలంగాణకు పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేడు ఢిల్లీలో యూపీఎస్సీ కమిటీ సమావేశమై.. రాష్ట్రం పంపిన ఐదుగురు ఐపీఎస్ల నుంచి ముగ్గురి పేర్లను ఖరారు చేయనుంది. సీనియారిటీలో సీవీ ఆనంద్ ముందుండగా.. మహిళా అధికారికి అవకాశం ఇవ్వాలనుకుంటే శిఖాగోయల్, సౌమ్యా మిశ్రాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. యూపీఎస్సీ పంపే ముగ్గురి జాబితా నుంచి ప్రభుత్వం ఒకరిని ఎంపిక చేస్తుంది.