ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు రైల్వే గేట్ల బాధలు త్వరలో తొలగిపోనున్నాయి. సికింద్రాబాద్- కాజీపేట, బీబీనగర్-నడికుడి మార్గాల్లో తొమ్మిది ఆర్వోబీలు నిర్మించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. కేంద్రం ఆమోదం తెలిపితే భువనగిరి, నల్గొండ ప్రాంతాల్లోని రైల్వే గేట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుంది.