కాపులకు ఏం చేశారంటూ తనను విమర్శిస్తున్న వైసీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తాను కాపుల గురించి మాత్రమే ఆలోచించి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తనకు అన్ని సామాజికవర్గాలు ముఖ్యమేనని.. అందరి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. తనను ఒక్క సామాజికవర్గం , ప్రాంతానికి పరిమితం చేయాలని చూస్తే ఎదురుదాడి చేయాలంటూ జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ సూచించారు. అలాగే తనను ప్రశ్నించే నేతలు వంగవీటి రంగా విషయంలో ఏంచేశారని ప్రశ్నించారు.