Nandyal Miyazaki Mango Farming: తెలుగు రాష్ట్రాల్లో మామిడి పండ్ల సీజన్ ప్రారంభమైంది. నంద్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్రెడ్డి తన పొలంలో జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఖరీదైన మియాజాకీ మామిడి రకంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 20 రకాల మామిడి మొక్కలను సాగు చేస్తున్నారు. ఆయన తన పొలాన్ని ఒక ప్రయోగ క్షేత్రంగా మార్చి విభిన్న రకాల మామిడి సాగు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.