కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలంలోని లోడ్పల్లి అటవీ ప్రాంతంలో పంచపూల మొక్కలు తిని దాదాపు తొంభై గొర్రెలు మరణించాయి. కౌటాల మండలం నుండి వచ్చిన గొర్రెల కాపరులు జీవనాధారం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ మొక్కలు పశువుల కాలేయానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, మనుషులకు కూడా కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.