ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామన్నారు. రాష్ట్రంలో కొత్తగా పెద్దపల్లి, ములుగు పట్టణాల్లో ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్గో సేవలను సైతం విస్తృతం చేస్తామన్నారు.