Farmer Offering Food For Ten Rupees: ఏలూరు జిల్లా దెందులూరులో వీరమాచినేని శివాజీ అనే రైతు తన పొలంలో పండిన బియ్యంతో కేవలం రూ.10కే వెజ్ బిర్యానీ, పెరుగన్నం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారి ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో, ఎటువంటి లాభాపేక్ష లేకుండా గతంలో కూడా తక్కువ ధరకే అందించారు. ప్రస్తుతం రోజుకు 75 నుంచి 100 మందికి భోజనం పెడుతూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.