నల్గొండ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (GGH)లో ఆధునిక లాప్రోస్కోపీ యూనిట్ ప్రారంభమైంది. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదుపాయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులు డా. నాగేశ్వర్ రెడ్డి, డా. జీవీ రావు కలిసి ప్రారంభించారు. లాప్రోస్కోపీ సర్జరీలతో రోగులు తక్కువ సమయంలో కోలుకోవడంతో పాటు అధునాతన వైద్యం స్థానికంగానే అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సదుపాయాలను విస్తరించే దిశగా ఇది ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు.