తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఇకపై రాష్ట్ర ప్రజలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని, ఉత్పత్తి అయ్యే విద్యుత్ను హైదరాబాద్లో వాడుకోవచ్చు. అంతేకాదు, మిగిలిన కరెంటును డిస్కమ్కు అమ్మేయవచ్చు. దీనికి సంబంధించిన నిబంధనలను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి వెబ్సైట్లో పొందుపరిచింది. 10 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానెల్స్కు డిస్కమ్ మీటర్ ఏర్పాటు చేస్తుంది. ఈ నిర్ణయం సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి తీసుకున్నట్లు తెలుస్తోంది.