బీజేపీ అగ్రనేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతలు కలిస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటూ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 కార్పొరేషన్లు గెలుస్తామనే ప్రకటనలపై కూడా సందేహం వ్యక్తం చేశారు. బూత్ స్థాయి కార్యకర్తలను బలోపేతం చేయకుండా విజయాలు సాధ్యం కావని.. పార్టీ అధిష్ఠానం ఒక్క వ్యక్తి చుట్టూ కాకుండా మొత్తం కేడర్ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.