కేంద్రమంత్రి బండి సంజయ్ ఒక వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈనెల 15 నుంచి స్కూళ్లు ఓపెన్ కానున్న నేపథ్యంలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించాలని.. బీజేపీ కార్యకర్తలకు సూచించారు. తన నియోజకవర్గంలోని ప్రతీ స్కూల్ను పరిశుభ్రం చేయాలని పేర్కొన్నారు. పాఠశాలలను శుభ్రం చేయడమే కాకుండా.. ఊరూరా తిరిగి పిల్లలను బడికి పంపించాలని ప్రచారం చేయాలని తెలిపారు.