తెలంగాణలోని స్కూల్ విద్యార్థులకు తీపి కబురు. ఈనెల 16 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు టైమ్ టేబుల్ కూడా వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్కూళ్లు నడవనున్నాయి. అన్ని ప్రైవేటు, గవర్నమెంట్, ఎయిడెడ్ స్కూళ్లు ఈ టైమింగ్స్ పాటించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.