తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళైంది. ఈనెల 30వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కేబినెట్ ఆమోదముద్ర వేసిన.. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై ఈ సమావేశాల్లో చర్చించనున్ననట్లు సమాచారం. మరోవైపు.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం తెలపనున్నారు. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ను కూడా ఎన్నుకోనున్నట్లు చర్చ జరుగుతోంది.