తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపు (మార్చి 12న) మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ఎల్పీ నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం నిర్వహించారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. అసెంబ్లీలో అవలంబించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాగా.. కేసీఆర్ చేసిన సూచనలతో.. ఈసారి అసెంబ్లీ రసవత్తరంగా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులోనూ కేసీఆర్ కూడా అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో.. ఎలా జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది.