మార్చి 12వ తారీఖున జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ తరపును దాసోజు శ్రవణ్ నామినేషన్ వేసిన క్రమంలో.. మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేటీఆర్ మాట్లాడారు. ఈ క్రమంలోనే.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావటంపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.