2029 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 70కిపైగా స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన నేత, తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కిరణ్ రాయల్.. ఎన్నికల పొత్తులు, సీట్ల లెక్కలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లేకుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చేది కాదని.. టీడీపీ ఎలక్షన్ కూడా చేయలేకపోయేదన్నారు. గతంతో పోలిస్తే తమ బలం పెరిగిందన్న కిరణ్ రాయల్.. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మళ్లీ 21 సీట్లు ఇస్తామంటే అంగీకరించమని స్పష్టం చేశారు.