తెలంగాణలో ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని పండితులు బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం ద్వారా వినిపించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాలన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ ఏడాది తుపాన్లు, భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చునని చెప్పారు. అది మినహాయిస్తే..ప్రజలు అత్యంత సంతోషంగా ఉంటారన్నారు.