ఆంధ్రప్రదేశ్లో రహదారులకు మహర్దశ పట్టనుంది. రాష్ట్రంలో రోడ్లకు సంబంధించిన పనులను చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రోడ్లకు సంబంధించిన 225 పనులు చేపట్టేందుకు వీలుగా రూ.600 కోట్లు నిధులు విడుదల చేసింది. ప్రాధాన్యత క్రమంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టనున్నారు. రాష్ట్ర, జిల్లా రహదారుల మరమ్మత్తుల కోసం ఈ రూ.600 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.