Andhra Pradesh Man Attempts Live Burial: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి చేసిన పనితో అందరూ కంగారుపడ్డారు. మాజీ సర్పంచి కుమారుడు పన్నెండేళ్ల క్రితం ఊరి శివారున తమ పొలంలో భూదేవి ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయం ముందు ఆరు అడుగు గుంత తవ్వాడు. అయితే ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున కోటిరెడ్డి ఆ గుంతలో కూర్చోగా.. కుమారుడు రేకు పెట్టి మట్టితో పూడ్చాడు.. కారణం తెలిసి అందరూ అవాక్కు.