ఉగాది పండుగ వేళ పేదలుకు మేలు జరిగేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన ఫైలుపై ఆయన సంతకం చేశారు. అనంతరం ఆయన విజయవాడలో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. అయితే, జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మ సార్థకమవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు.