ఉత్తమ్‌పై కోమటిరెడ్డి అసహనం.. ఎయిర్‌పోర్టు నుంచి అలిగివెళ్లిపోయిన మంత్రి, కారణం ఏంటంటే..?

7 months ago 6
నాగార్జునసాగర్ గేట్ల ప్రారంభోత్సవ పర్యటనలో మంత్రుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, గంటసేపు ఎదురుచూసినా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు. దీంతో కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మమ్మల్ని తొందరగా రమ్మని చెప్పి, తను ఆలస్యంగా వస్తాడా?' అంటూ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచే అలిగి వెనుదిరిగారు. దీంతో కోమటిరెడ్డి లేకుండానే ఉత్తమ్, లక్ష్మణ్ సాగర్‌కు వెళ్లారు.
Read Entire Article