ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. శ్రీకాకుళం నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు, బస్సులు.. వివరాలివే

6 months ago 8
శబరిమల అయ్యప్ప భక్తుల కోసం తూర్పు కోస్తా రైల్వే.. ప్రత్యేక రైలు సర్వీసును ప్రకటించింది. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి కొల్లాం వరకూ ఈ ప్రత్యేక రైలు సర్వీసు నడవనుంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి జనవరి 26 వరకూ ప్రతి ఆదివారం.. ఈ ప్రత్యేక రైలు సర్వీసు అందుబాటులో ఉంటుందని తూర్పు కోస్తా రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం కొల్లాం ప్రత్యేక రైలు బయల్దేరనుంది. అలాగే కొల్లాం నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు తిరిగి శ్రీకాకుళం బయల్దేరుతుందని అధికారులు వెల్లడించారు.
Read Entire Article