హైదరాబాద్ మెట్రో ట్రైన్లను ఉదయం 6 గంటలకు బదులుగా 5 గంటలకే ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెల్లవారుజామున రైల్వే స్టేషన్లకు చేరుకునే, స్టేషన్ల నుంచి బయల్దేరే ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన సీఎస్కు వివరించారు. గతంలో ఎల్అండ్టీ సాంకేతిక కారణాలతో తిరస్కరించినప్పటికీ.. సీఎస్ ఆదేశాల మేరకు మెట్రో అధికారులు మరోసారి ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు.